దోమల కాయిల్ దుర్ఘటన… కంటెపూడిలో వ్యక్తి సజీవ దహనంపల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో దోమల బెడదతో రాత్రి సమయంలో దోమల కాయిల్ (చక్రం) వెలిగించి నిద్రపోయిన నాగేశ్వరరావు, అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.దోమల కాయిల్ నుంచి వచ్చిన నిప్పురవ్వ దుప్పటికి అంటుకోవడంతో మంటలు వ్యాపించి నాగేశ్వరరావు సజీవ దహనమైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ మరణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి
Author: myapnews9@gmail.com
గుంటూరు: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో గుంటూరులో ఆన్లైన్ బెట్టింగ్పై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో దాడులు నిర్వహించి మొత్తం 15 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు.లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడులు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లావత్ నాయక్ అనే వ్యక్తి “నేషనల్ ఎక్స్చేంజ్” యాప్ ద్వారా ఇతరులతో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో రూ.1,25,000 నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అలాగే ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్కే రియాజ్ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఆఫ్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.75,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, ఐపీఎల్ సీజన్ను అవకాశంగా…
దాచేపల్లి: విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించాలని మాచర్ల ఈఈ సింగయ్య కోరారు. గురువారం నారాయణపురం కార్యాలయంలో సిబ్బందితో విద్యుత్ బిల్లుల వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులు తమ ఇళ్లు, దుకాణాలకు సంబంధించిన కరెంటు బిల్లులను ప్రతి నెలా బకాయిలు లేకుండా చెల్లించాలని సూచించారు. అలాగే అధికారులు, ఉద్యోగులు నెలవారీ వసూళ్లతో పాటు పెండింగ్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నూరు శాతం వసూళ్ల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఏఏఓ సందీప్ కుమార్, జేఏఓ ఆశీర్వాదం, డీఈఈ వీరేశ్వరరావు, ఏఈలు భగవాన్, దండా నాగేశ్వరరావు, సబ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఇటీవలి కాలంలో సుమారు 50 కాటన్ సెర్చ్లు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా గొడవలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇటీవలి కాలంలో యువతలో గంజాయి వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా విద్యార్థులు కూడా దీనికి బానిసలవుతున్నారని చెప్పారు. గంజాయి అలవాటు కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, అక్రమ కార్యకలాపాలు, పేకాట శిబిరాలపై సమాచారం ఉంటే వెంటనే 112కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా గ్రామంలో అనుమానితులుగా భావించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
మాచర్ల: వరికపూడి ప్రాజెక్టు నిర్మాణం కోసం మే 1 నుంచి 42 రోజుల పాటు దీక్ష చేపట్టనున్నట్లు జల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పల్నాడు శ్రీను తెలిపారు. స్థానిక సిపిఐ కొమెర వీరాస్వామి భవన్లో ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడు బత్తుల వీరయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పల్నాడు శ్రీను మాట్లాడుతూ, వరికపూడి ప్రాజెక్టు పల్నాటి ప్రజలకు దశాబ్దాలుగా నెరవేరని కలగా మిగిలిపోయిందన్నారు. పాలకులు మారినా ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు త్వరలో ప్రారంభిస్తామంటూ కాలం గడిపిన పాలకులు, ఇప్పుడు అనుమతులే రాలేదని చెప్పడం బాధాకరమన్నారు.అనుమతులు పూర్తిగా లేకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.ప్రాజెక్టు పనులు ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అందులో భాగంగా మే 1 నుంచి…
పలనాడు పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు మాచర్ల నియోజకవర్గ స్థాయిలో పాలిటెక్నిక్ మోడల్ ఎంట్రన్స్ పరీక్షను వికాస్ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 170 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఈ పరీక్షలో సి.హెచ్. వరుణ్ 93 మార్కులతో ప్రథమ స్థానాన్ని సాధించారు. ఆయనకు స్థానిక న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ జున్నా శ్రీనివాసరెడ్డి ప్రకటించిన రూ. 8116 నగదు బహుమతిని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నరసింహారావు, లక్ష్మయ్యల చేతుల మీదుగా అందజేశారు.జె. చరణ్ తేజ 87 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పొందగా, వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తరఫున వై. కొండయ్య రూ. 5116 బహుమతిని అందజేశారు.పి. మహేంద్ర 85 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించగా, శ్రీ విష్ణు జూనియర్ కాలేజ్ తరఫున రూ. 3116 నగదు బహుమతిని కళాశాల డైరెక్టర్ మనోజ్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా పలనాడు ప్రతిభ జూనియర్ కళాశాలల సెక్రటరీ &…
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు విధాని ధర్ దాస్ (46) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఉపాధి కోసం ఒడిశా నుంచి గణపవరం వచ్చిన ఆయన, కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
