Author: myapnews9@gmail.com
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, అమరావతి నిర్మాణం వంటి కార్యక్రమాలతో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.అలాగే, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని, నాయకుల పట్ల గౌరవాన్ని తెలియజేసే మంచి అవకాశం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల పట్టణంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాచర్ల అన్న క్యాంటిన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రజలకు ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు.జన్మదినోత్సవాన్ని సేవా దినోత్సవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మూడు పూటలుగా ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. పట్టణ ప్రజలు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.అన్న క్యాంటిన్లో పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ భోజన పదార్థాలను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పంపిణీ జరగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉపశమనం కలగడమే కాకుండా, సామాజిక సేవా స్పూర్తి మరింత బలపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అగ్నిమాపక అధికారులకు సన్మానంమాచర్ల :అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఆదివారం వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ నిర్వాహుకులు 12 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వాసవిక్లబ్ రీజియన్ చైర్మన్ ఓరుగంటి చెన్నకేశవరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ మాట్లాడుతూ అగ్నిమాపక అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి వాసవి క్లబ్ నిర్వాహుకులు సన్మానించటం అభినందనీయమన్నారు. ప్రమాదాలు చెప్పిరావని, ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణ, ఆస్థిని కాపాడుతారని, వారి సేవలు వెలగట్టలేనివని పేర్కొన్నారు. అగ్నిమాపక ఇంచార్జి అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని పలు ఆపార్ట్ మెంట్లు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలుపై అవగాహన కార్యక్రమాలు…
మాచర్ల: కృష్ణవేణి జూనియర్ కళాశాల మరియు ఎస్విఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి 100 మందికి పైగా ప్రజలు హాజరై తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పొందారు.ఈ శిబిరంలో కేరళకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య సంస్థ శ్రీధరీయం ఆయుర్వేదిక్ పంచకర్మ వైద్యులు డాక్టర్ దిలీపన్ మరియు వారి సిబ్బంది పాల్గొని, రోగుల సమస్యలను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందించారు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరం ప్రజలకు ఉపయోగకరంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యనమదల వెంకట్రామయ్య, డైరెక్టర్లు సుబ్బారావు, శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతినెల నిర్వహించనున్నట్లు మేనేజర్ హుస్సేన్ తెలిపారు. మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్వాహకులు సూచించారు.
మాచర్ల మండలం: పల్నాడు ప్రాంత అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాళ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఐఆర్పీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, ఇండియా ఎన్స్యూర్, అసిస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూ.24 లక్షల వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్ను ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ లావు మాట్లాడుతూ, వెనుకబడిన పల్నాడు అభివృద్ధికి ఈ ప్రాంతంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన వారు దాతలుగా మారి తమ మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, తాగు మరియు సాగునీటి రంగాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మాచర్ల నియోజకవర్గానికి మౌళిక వసతులు, రోడ్లు, తాగు–సాగునీరు, యువతకు ఉపాధి వంటి అంశాల్లో రానున్న మూడేళ్లలో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న…
పల్నాడు జిల్లాలో ప్రతి గడపకు తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆదివారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి ఎస్కేబీఆర్ కళాశాల క్రీడా మైదానం పక్కన రూ.25 కోట్లతో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయ స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ మ్యాప్ను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ లావు, మొదటి దశలో రూ.1200 కోట్ల వ్యయంతో సాగర్ శుద్ధ జలాలను మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మిగతా ఐదు నియోజకవర్గాలకు జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత గల మూడు ప్రాజెక్టుల్లో వరికపూడిశెల ఒకటని, త్వరితగతిన అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలికంగా స్థానిక బాయ్స్ హై స్కూల్లో…
మాచర్ల: సామాజిక సేవా కార్యక్రమాల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తమవంతు భాగస్వామ్యం చూపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు.ఆదివారం స్థానిక కేసీపీ రోడ్డులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పూర్తితో “మన మాచర్ల – మన బ్రహ్మారెడ్డి” పేరుతో టీడీపీ మైనారిటీ యువ నాయకుడు షేక్ మోసిన్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా చిరు వ్యాపారులకు 10 తోపుడు బండ్లను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి అర్హులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నిరుపేద వీధి వ్యాపారుల కోసం మోసిన్ అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నిరుపేద వీధి వ్యాపారుల కోసం మోసిన్ అందిస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాచర్ల: పట్టణంలోని వైభవ్ రెసిడెన్సి అండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు సుమారు రూ.75 వేల విలువైన ఏడు ట్రైసైకిళ్లను రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ ఎస్.వి. రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు.దుర్గి మండలంలోని ముటుకూరు సమీప కొండ ప్రాంతంలో ఉన్న నెహ్రూ తండా ప్రజల సమస్యలను గుర్తించిన రోటరీ క్లబ్, వారికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు సుమారు రూ.2 లక్షల విలువైన ఆర్ఓ ప్లాంట్ను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ను జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు పంగులూరి కళ్యాణ్ సహకారంతో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ సీనియర్ రొటేరియన్ ఝాన్సీ ప్రేమానంద్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. రోటరీ క్లబ్బుల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. తాళ్లపల్లి పవర్…
జన్మదిన వేడుకల సందర్భంగా మండలంలోని డ్వాక్రా యానిమేటర్లకు చీరలు పంపిణీ చేశారు. అలాగే కారంపూడిలోని వీర్ల అంకాలమ్మ దేవస్థానం, పేట సన్నెగండ్లలోని సింగరెట్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మునుగోటి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు చప్పిడి రాము, ఎం.పి.పి బోల్నేడి శ్రీనివాసరావు, కారంపూడి మండల అధ్యక్షులు గోళ్ళ సురేష్ యాదవ్, మాజీ మండల అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ, మాజీ కోఆప్షన్ సభ్యులు తండా మస్తాన్ జానీ, కారంపూడి పట్టణ మాజీ అధ్యక్షులు కటికల బాలకృష్ణ, చిరుమామిళ్ల శ్రీను, కోదాటి ప్రభాకర్, ఎస్పిఆర్ కృష్ణ, షేక్ నన్నేసా, కర్నాటి మహేష్, బాలు నాయక్ తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
