Author: myapnews9@gmail.com

“మొదట పగ తీర్చుకుంటాం.. తర్వాత అభివృద్ధి” – కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుగురజాల, పల్నాడు జిల్లా:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురజాలలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రోడ్డెక్కాయి.ఈ కార్యక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండేళ్లలో గురజాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పనులు చేపట్టలేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలకు కేవలం రంగులు వేయడం తప్ప అభివృద్ధి పనులు జరగలేదని ఎద్దేవా చేశారు.అలాగే వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “రాబోయేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన తొలి…

Read More

మాచర్ల, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.మాచర్ల రింగ్‌రోడ్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్క్ సెంటర్‌లో నడిరోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తర్వాత బస్టాండ్ సెంటర్‌లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు భరోసా, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని,…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని కొత్త బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న జగనన్న ప్లాట్ల ప్రాంతంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.మృతుడిని చల్ల భూదేవయ్య (50)గా గుర్తించారు. వడ్డెర కులానికి చెందిన భూదేవయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు దూరంగా ఉండగా, అప్పుడప్పుడు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు, బైపాస్ రోడ్డుకు సమీపంలోని ఓ జామ తోటలో భూదేవయ్య గతంలో సుమారు మూడు నెలల పాటు వాచ్‌మెన్‌గా పనిచేశాడు. మద్యం సేవించే అలవాటు అధికంగా ఉండటంతో యజమాని అతడిని విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. ఇటీవల మళ్లీ పనిలో చేర్చుకోవాలని కోరినా యజమాని నిరాకరించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో జామ తోట సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో భూదేవయ్య మృతదేహం…

Read More

పల్నాడు జిల్లా, కారంపూడి మండలం: మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం గాదెవారిపల్లె గ్రామంలో కారంపూడి సీఐ శరత్ బాబు ఆధ్వర్యంలో గురువారం విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని అనుమానిత ప్రాంతాలు, ఇళ్లు, పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో కొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకోగా, సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నవేనా లేదా ఇతర కారణాలతో ఇళ్లలో ఉంచారా అనే విషయంపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ శరత్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలు పటిష్టం చేయడం, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, యాజమాన్య వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.యువత డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, సైబర్…

Read More

మాచర్ల మండలం ముత్యాలంపాడు గ్రామ రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం రైతులకు శాశ్వత భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నారు.సమాజంలో ప్రశాంతత నెలకొనాలంటే భూ వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో దాదాపు 75 శాతం భూములకు సంబంధించినవేనని తెలిపారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. గత పాలనలో భూ రికార్డుల్లో జరిగిన అవకతవకల కారణంగా అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరి ఆస్తులను ఇతరుల పేర్లతో నమోదు చేసి రుణాలు పొందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో భూ సమస్యలు అధికంగా…

Read More

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 32 మంది అరెస్ట్నగదు, బైకులు, కార్లు స్వాధీనంపల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామ పరిధిలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయ సమీపంలో భారీగా పేకాట నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కారంపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శరత్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 32 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల నగదు, 20 బైకులు, 5 కార్లు, 30 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శరత్ బాబు తెలిపారు.అరెస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read More

మాచర్ల నియోజకవర్గ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు మాచర్ల పట్టణంలోని PWD కాలనీ వాణి గ్రౌండ్‌లో SFI ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలకు మాచర్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీ యెనుముల కేశవరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేత జట్లకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా మొత్తం ₹35,000 నగదు ప్రోత్సాహకాలను అందజేసి అభినందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావనను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలంటే క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

Read More

రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన.. సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణకు టీడీపీ అవకాశంఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. పార్టీ అధిష్ఠానం ముగ్గురు నేతల పేర్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.🔹 సానా సతీష్🔹 చింతకాయల విజయ్🔹 భాష్యం రామకృష్ణటీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో అభ్యర్థులు నామినేషన్‌కు సంబంధించిన పత్రాలను అందజేశారు. పార్టీకి సేవలందించిన నేతలకు అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన ఈ పేర్లు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ బలోపేతం, అభివృద్ధి లక్ష్యాలతో ఈ ఎంపికలు చేసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read More