Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సందర్భంగా ఓ హృదయాన్ని కదిలించే సంఘటన చోటుచేసుకుంది. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారి పాపను ఎత్తుకుని, ఆమె తండ్రి పెన్షన్ కోసం కార్యక్రమానికి వచ్చాడు.ఈ విషయం తెలుసుకున్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వెంటనే స్పందించారు. పాప పరిస్థితిని దగ్గరగా గమనించిన ఆయన, ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందేలా అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. అర్హతల ప్రకారం పింఛన్ మంజూరు చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా సహాయం అందించాలని స్పష్టం చేశారు. పేదల బాధలను అర్థం చేసుకుని, వెంటనే స్పందించడం నాయకత్వ లక్షణమని ఈ సంఘటన మరొకసారి చాటిచెప్పింది. అధికారులతో కలిసి గడపగడపకు వెళ్లిన ఎమ్మెల్యే, ప్రతి కుటుంబం సమస్యలను వినిపించుకుని పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు.ఈ ఘటనతో గ్రామస్తులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మానవత్వాన్ని ప్రశంసించారు. అవసరమైన సమయంలో అండగా నిలిచే నాయకుడిగా…

Read More

ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

Read More

కార్మికుల కష్టాన్ని గౌరవించడం, వారి హక్కుల కోసం పోరాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్మిక సోదర సోదరీమణులకు ఈ రోజు ఒక పండుగలాంటిదని, వారి శ్రమను గౌరవించే రోజు ఇదని చెప్పారు.ఈ సందర్భంగా వరికెపూడి శెల ప్రాజెక్టుపై ఆయన స్పందిస్తూ, ప్రాజెక్టు సాధన కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పోలీసులు మొదట అనుమతి ఇచ్చి, తరువాత రాజకీయ ఒత్తిళ్లకు లోనై నిరాకరించడం సరికాదని విమర్శించారు. పది మండలాలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టును అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రస్తావిస్తున్నాయని, కానీ ఆచరణలో పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వరికెపూడి శెల ప్రాజెక్టును ప్రారంభించి మొదటి దశ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.వేసవి సెలవుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియ పూర్తయిందని ఆయన తెలిపారు.బీసీల సామాజిక స్థితిగతులపై జరుగుతున్న సర్వే పూర్తి కావడానికి మరో నెల రోజులు పట్టవచ్చని కోర్టుకు తెలియజేశారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు వివరించారు.సర్వే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏకసభ్య కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని ఏజీ పేర్కొన్నారు.ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. తదుపరి విచారణను జూలై మొదటి వారానికి వాయిదా వేసింది. అప్పటికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read More

పల్నాడు జిల్లాలో మరోసారి సీఐ చిన్న మల్లయ్య పేరు వివాదంలోకి వచ్చింది. తనను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.ధనలక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. గతంలో వినుకొండ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య, అప్పట్లో తనకు పరిచయం అయ్యాడని బాధితురాలు తెలిపింది.బ్రాహ్మణపల్లి వద్ద తన ఇంటికి వచ్చి బలవంతంగా అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అనంతరం చిన్న మల్లయ్యను గదిలో బంధించి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇటీవలే కారంపూడిలో టీడీపీ నేతను గన్‌తో బెదిరించిన వివాదంలో చిన్న మల్లయ్య పేరు వినిపించింది. ఆ ఘటన తర్వాత ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయనను వీఆర్‌కు పంపిన విషయం…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 18వ వార్డులో నివాస గృహాల మధ్య పేరుకుపోయిన చెత్త కుప్పలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోయారు.వార్డులో ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోవడంతో, ఎవరో కాల్చిపారేసిన సిగరెట్ పీకల కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ, నివాస ప్రాంతాల మధ్య పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను కోరారు.అగ్నిమాపక శాఖ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని…

Read More

పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి. ఆంజనేయులు అధికారులను ఆదేశించారు ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు 24 గంటల్లోనే చర్యలు చేపట్టిన వినుకొండ సీఐ ప్రభాకర్, అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న రెండు భారీ టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.ప్రభుత్వ భూముల్లో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీల సహాయంతో గ్రావెల్ తవ్వి, టిప్పర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి మంగళవారం వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఎవరైనా అక్రమంగా గ్రావెల్ (మట్టి) తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రభాకర్ హెచ్చరించారు

Read More

బాపట్ల జిల్లాలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, భారీ మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు.మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా బూటియా గ్రామానికి చెందిన భురు మక్వానా, రమేష్ మాచర్, సంతోష్ భూరియా అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.వీరు బిల్లు తెగకు చెందిన వారని, దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో వీరిపై అనేక దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు.బాపట్ల, చీరాల, గూడూరు, గుంటూరు ప్రాంతాల్లో వీరిపై మొత్తం 18 కేసులు నమోదయ్యాయని, వాటికి సంబంధించి రికవరీ చేపట్టినట్లు పేర్కొన్నారు.నిందితుల వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, రూ.21.90 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు…

Read More