పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోయపల్లి గ్రామంలో పిడుగు పడటంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీ మండ్లి నాసరయ్యకు చెందిన పూరి గుడిసెపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో గుడిసె పూర్తిగా కాలిపోయింది. సంఘటన సమయంలో గుడిసెలో ఎవరూ నివాసం ఉండకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.అయితే గుడిసెలో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Author: myapnews9@gmail.com
జూలకంటి వ్యాఖ్యలకు పిన్నెల్లి ఘాటు కౌంటర్.. “మగతనం గురించి మాట్లాడే అర్హత నీకుందా?” మాచర్ల రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. టిడిపి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 15 సంవత్సరాల పాటు నియోజకవర్గానికి దూరంగా పారిపోయిన వ్యక్తి ఇప్పుడు మగతనం గురించి మాట్లాడటం విచిత్రమని పిన్నెల్లి విమర్శించారు. ప్రజల ముందే నిజాలు చెప్పేందుకు సిద్ధమని, ఎవరి హయాంలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తమ పాలనలో రోడ్ల నిర్మాణం, కేంద్ర విశ్వవిద్యాలయం, జలజీవన్ మిషన్, ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు పెంపు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇవన్నీ తాము తీసుకొచ్చిన పనులేనని, ఇప్పుడు వాటిని…
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై నాలుగు బీరు బాటిళ్లు విసిరితే భయపడే వ్యక్తిని కాదని, 45 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పరిస్థితులు చూశానని, దేనికీ బెదరనని స్పష్టం చేశారు. నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజల కోసం అన్నింటికీ సిద్ధమయ్యానని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులపై తీవ్ర విమర్శలు చేసిన బ్రహ్మానందరెడ్డి, వారు మాచర్లను పట్టిపీడిస్తున్న పరాన్నజీవులని ఆరోపించారు. రామకృష్ణారెడ్డికి నిజమైన ధైర్యం ఉంటే మాచర్ల సెంటర్లో నిలబడి ప్రజల మధ్య చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల అభివృద్ధి కోసం, ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొనేలా పనిచేస్తున్నామని తెలిపారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎటువంటి దాడులకు పాల్పడినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.పిన్నెల్లి సోదరులు సంపాదించిన ప్రతి రూపాయిలో ప్రజల రక్తం, చెమట ఉందని ఆరోపించిన ఆయన,…
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి పై బీరుసీసాలతో దాడి యత్నం.. ఒకరు అదుపులో, ముగ్గురు పరార్రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామంలో జరిగిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై బీరుసీసాలతో దాడి యత్నం జరిగింది.ఎమ్మెల్యే కాన్వాయ్ గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సచివాలయం వద్ద మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఆయన కారుపై బీరుసీసాలు విసిరినట్లు సమాచారం. అయితే సీసాలు ఎస్కార్ట్ వాహనంపై పడటంతో ప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై వాహన శ్రేణిని నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎస్కే సైదా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గురజాల డీఎస్పీ ఎం.మహేశ్వరరావు హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.తర్వాత మాజీ సర్పంచ్ గోళ్ల వెంకటనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “నేను పల్నాడు బిడ్డనే.. తాటాకు చప్పుళ్లకు భయపడేది…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి పట్టణం సినీ పక్కిలో సోమవారం ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోనే బహిరంగంగా ఒక వ్యక్తిపై దుండగులు దాడి చేసి, సుమారు కేజీ బంగారాన్ని దోచుకెళ్లడం కలకలం రేపింది.వినుకొండకు చెందిన బంగారు వ్యాపారి యక్కల శ్రీనివాసరావు ప్రతి సోమవారం మాదిరిగానే కారంపూడిలోని పలు జ్యువెలరీ షాపులకు బంగారు ఆభరణాలు సరఫరా చేయడానికి వచ్చాడు. అతని రూటీన్ను గమనించిన దుండగులు ముందుగానే పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సినీ పక్కిలో అనుకూల సమయం చూసుకుని రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు మొదట శ్రీనివాసరావుపై దాడి చేశారు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా, కొద్దిసేపటికే మరోసారి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతని వద్ద ఉన్న సుమారు కేజీ బంగారు ఆభరణాలను లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు రక్తస్రావంతో కిందపడిపోయిన బాధితుడు తేరుకున్న వెంటనే కారంపూడి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా…
ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత, స్థిరమైన ఆదాయం, సమాజంలో గౌరవం — ఇవన్నీ కలిపి ఒక మంచి జీవితం. కానీ ఆ అవకాశాన్ని కొందరు అధికారులు స్వార్థం కోసం వాడుకుంటూ అవినీతి బాట పడటం ఆందోళన కలిగించే విషయం.బాపట్ల మునిసిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న షేక్ ఇమామ్ అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లంచం డిమాండ్ చేసిన ఘటనలో ఏసీబీకి చిక్కి అవినీతి బండారం బహిర్గతమైంది.ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ వివరాల ప్రకారం:దేవరకొండ సుబ్బారావు అనే వ్యక్తి బాపట్ల పట్టణంలో భార్య, కూతురు పేర్లపై రెండు ఇళ్లు కొనుగోలు చేసి, ఇంటి పన్ను పేరు మార్పు కోసం మునిసిపల్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు.భార్య పేరుతో ఉన్న ఇంటి పన్ను పేరు మార్పు కోసం రూ.25,000 ప్రభుత్వ ఫీజుతో పాటు మరో రూ.25,000 లంచంగా ఇమామ్కు చెల్లించి పని చేయించుకున్నాడు. తర్వాత కూతురు పేరుతో ఉన్న ఇంటి పన్ను మార్పు…
ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ నిరంజన్ మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అపరిచిత వ్యక్తులు గ్రామంలో కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ తనిఖీలతో గ్రామంలో భద్రతా పరిస్థితులు మరింత బలపడతాయని పోలీసులు పేర్కొన్నారు.
