
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మాచర్ల పట్టణంలోని 5వ, 22వ వార్డుల్లో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్-3 ఇన్చార్జి, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు, 82వ బూత్ ఇన్చార్జి నరా రాముడు, 92వ బూత్ ఇన్చార్జి తమిశెట్టి ఏడుకొండలు, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతి కుమార్, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మధినేటి శాంతి, టీడీపీ కార్యకర్త ఎ. వాసు, పట్టణ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కొమెర సాంబ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ
ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో NTR భరోసా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పెన్షన్ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేయడం ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తామని తెలిపారు.
అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. NTR భరోసా పెన్షన్ పథకం పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు.
