
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై స్పందించారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. మహిళా సంక్షేమం, ఐటీ రంగ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు.
మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి భారీ కంపెనీలు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజలతో మమేకమైన నాయకుడని కొనియాడిన యరపతినేని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, జూలకంటి కుటుంబంతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా ఆత్మీయ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. మాచర్ల – గురజాల నియోజకవర్గాలు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.
సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అమరావతి రాజధాని అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.
