
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 32 మంది అరెస్ట్
నగదు, బైకులు, కార్లు స్వాధీనం
పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామ పరిధిలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయ సమీపంలో భారీగా పేకాట నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 32 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల నగదు, 20 బైకులు, 5 కార్లు, 30 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శరత్ బాబు తెలిపారు.
అరెస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
