టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేశారు. బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలతో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనకు సద్బుద్ధి కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు బి.ఆర్. నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
Author: myapnews9@gmail.com
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దుర్గి మండలానికి చెందిన శ్రీపత్తి అమరేంద్ర (30) పాల వ్యాపారం చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అప్పుల పాలైనట్లు సమాచారం. తెలిసిన వారి బంగారాన్ని బ్యాంకులో పెట్టి నగదు తీసుకున్నప్పటికీ, ఆ బంగారాన్ని తిరిగి విడిపించకపోవడంతో పాటు సుమారు రూ.20 నుండి 25 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న అమరేంద్ర, దుర్గి నుంచి సంతమాగులూరు వచ్చి తన స్నేహితుడి వద్ద కారు తీసుకుని వెళ్లినట్లు సమాచారం.ఆయనతో పాటు భార్య త్రివేణి (22), పిల్లలు హర్షవర్ధన్ (5), ధర్నాశ్రీ (3) ఉన్నట్లు గుర్తించారు. అప్పుల భారంతో ఈ కుటుంబం తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం
గత 20 ఏళ్ల కాలంలో మాచర్ల నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశామని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.మాచర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.175 కోట్ల వ్యయంతో 45 గ్రామాల్లో రైతుల కోసం విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా 59 కిలోమీటర్ల మేర కొత్త 3-ఫేస్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.మారుమూల గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో రూ.100 కోట్ల వ్యయంతో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేసి, సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా వరికపుడిసెల నిర్మాణానికి తమ హయాంలో అనుమతులు సాధించి, కరోనా కాలాన్ని మినహాయిస్తే కేవలం మూడు సంవత్సరాల్లోనే పనులు ప్రారంభించినట్లు చెప్పారు.తాము అధికారంలో ఉన్న సమయంలో…
మాచర్ల పట్టణంలో నిన్న చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి బాధితురాలి నివాసానికి క్లూజ్ టీం చేరుకుని కీలక ఆధారాలను సేకరిస్తోంది.ఈ సందర్భంగా వేలిముద్రలు సహా ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించి పరిశీలనకు పంపిస్తున్నారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు జిల్లా అదనపు ఎస్పీ స్థాయి అధికారిని మాచర్లలోనే మకాం పెట్టించి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనలో తెలిసిన వ్యక్తుల ప్రమేయమా, లేక బయటి వ్యక్తులా అన్న కోణాల్లో పోలీసులు అన్ని అవకాశాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదంలో కాబోయే వధూవరుల దుర్మరణందుర్గి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. త్వరలో వివాహ బంధంతో ఒక్కటవ్వాల్సిన యువ జంట రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.గుంటూరు పట్టణానికి చెందిన నేలపాటి సందీప్ (21), సోఫియా (20) కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉండగా, ఇరు కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించాయి. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.గుడ్ ఫ్రైడే సందర్భంగా సందీప్ యేసుక్రీస్తు మాల వేసుకున్నాడు. మాల విరమించేందుకు సోఫియాతో కలిసి ద్విచక్ర వాహనంపై విజయపురి సౌత్లోని సాగర్మాత చర్చికి వెళ్లారు. అక్కడ ప్రార్థనలు చేసి, నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని దేవుని ప్రార్థించారు. అనంతరం సాగర్, ఎత్తిపోతల ప్రాంతాలను వీక్షించి గుంటూరుకు తిరుగు ప్రయాణం ప్రారంభించారు.ఈ క్రమంలో దుర్గి మండలం ఓబులేశునిపల్లె గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్ను గుర్తించలేక ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి…
లోక్సభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం ఐదు కోట్ల ఆంధ్రుల విజయంగా భావిస్తున్నామని టీడీపీ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు అన్నారు. అమరావతి ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అని, ప్రజా రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.అమరావతికి పూర్తి స్థాయిలో న్యాయం చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు. ఈ బిల్లుతో ఇకపై అమరావతిని ఎవరూ మార్చలేరని, మూడు రాజధానుల అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయాలు చేయలేరని విమర్శించారు.రాష్ట్ర విభజన సమయంలో అమరావతికి మద్దతు తెలిపిన వైఎస్ జగన్, 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని, ఏ ప్రాంతానికీ న్యాయం జరగలేదని అన్నారు.అమరావతి నిర్మాణం కోసం రైతులు సుమారు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన ఘనత ప్రపంచంలో అరుదైనదని తెలిపారు. మూడు రాజధానుల ప్రకటనతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారని…
మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈరోజు ఉపాధిహామీ సిబ్బందితో ఎంపిడిఓ శ్రీ ఆర్. ఫణి కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో 01.04.2026 నుండి ఉపాధిహామీ (వీబీ జి రామ్ జి) పనులను ప్రారంభించాలని ఆదేశించారు.రేపటి నుండి అన్ని గ్రామాలలో పండగ వాతావరణంలో పనులను ప్రారంభించి, శ్రామికులు పెద్దఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశాల్లో శ్రామికులకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు.శ్రామికుల హాజరు ఫేస్ ఆథెంటికేషన్ (ఆధార్ ఆధారిత) విధానంలో నమోదు చేయబడుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఏపీఓ నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో మేట్లను నియమించాలని, శ్రామికులు అందరూ విధిగా పనులకు హాజరుకావాలని కోరారు.
మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలను సన్మానించారు. మండలంలో మొత్తం 200 కుటుంబాలు 100 రోజుల పనిని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా కంభంపాడు గ్రామానికి చెందిన ఎల్లాపి వెంకటేశ్వర్లు గారిని ఎంపిడిఓ ఫణి కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా మండలంలోని అన్ని శ్రామికులు 100 రోజుల పనిని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వీబీ జి రామ్ జి పథకం కింద 125 రోజుల వరకు పనిని వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ వెంకయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సెర్చ్ సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను, కొన్ని మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో వివాదాలకు తావు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలని సూచించారు. గ్రామాల్లో నేరాలను పూర్తిగా అరికట్టాలని, డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.అలాగే గ్రామాల్లో ఏవైనా అనుమానాస్పద లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమం కారంపూడి సర్కిల్ సీఐ శరత్, ఎస్సై వాసు పర్యవేక్షణలో 42 మంది సిబ్బందితో నిర్వహించినట్లు తెలిపారు.
గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగాస్వామివారికి నూతన పల్లకి బహుకరణమాచర్ల మండలం గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కిన పున్నయ్య కుమారులు స్వామివారికి నూతన పల్లకిని భక్తి భావంతో బహుకరించారు.అనంతరం దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి పారవశ్యం కనిపించింది.
