Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం ఆదివారం సామాజిక న్యాయం, సమానత్వం విలువలను ప్రతిబింబించే వేదికగా మారింది. భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు. విగ్రహం వద్ద కొద్దిసేపు గంభీర వాతావరణం నెలకొనగా, అనంతరం ప్రజలతో కలిసి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.వేడుకల అనంతరం నిర్వహించిన పులిహార పంపిణీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సామాన్య ప్రజలతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నాయకత్వానికి కొత్త సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ,“బాబు జగ్జీవన్ రామ్…

Read More

పల్నాడు జిల్లా వెల్దుర్తి పట్టణంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, తహసిల్దార్ రాజశేఖర్ నాయక్ పేర్కొన్నారు.ఆదివారం పట్టణంలోని ఎస్‌కేబీఆర్ క్రీడా మైదానంలో, ఎమ్మెస్సార్ టౌన్షిప్ డెవలపర్ మద్దిగపు శివరామిరెడ్డి సహకారంతో రూ.50,000 విలువైన వ్యాయామ పరికరాలను బహుకరించారు. ఈ పరికరాలను కమిషనర్ వేణుబాబు, తహసిల్దార్ రాజశేఖర్ నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. క్రీడా మైదానం అభివృద్ధికి వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కృషి అభినందనీయమని అన్నారు. ఇదే సందర్భంగా తహసిల్దార్ రాజశేఖర్ నాయక్ రూ.5,000ను వాకర్స్ అసోసియేషన్‌కు అందజేసి, ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మద్దిగపు చిన్న వెంకటరామిరెడ్డి, కొమేరా దుర్గారావు, కుర్రి…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. మాచర్ల పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది.ఇటీవల మాచర్లలో సంచలనం సృష్టించిన కామనబోయిన చౌడేశ్వరి హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కేసు దర్యాప్తులో ఆలస్యం, విధుల్లో నిర్లక్ష్యం, అలాగే అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో శాఖాపరమైన చర్యల భాగంగా సస్పెన్షన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పోరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు ఆధ్వర్యంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ చట్టబద్ధత కల్పించినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు, బూత్ ఇంచార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మాట్లాడుతూ…“అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిఫలం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి కృషి, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి మార్గదర్శకత్వంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం సాధ్యమైంది. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి కేంద్రబిందువుగా మారనుంది. రైతుల త్యాగాలకు న్యాయం జరిగిన రోజు ఇది. ఎన్డీఏ ప్రభుత్వానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గెంపూడి శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం ఉభయ సభల్లో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించడంపై సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కూటమి నాయకులతో పంచుకున్నారు. అనంతరం దీపాలను వెలిగించి బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు దుర్గెంపూడి శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ…“అమరావతి రాజధాని కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఆంధ్ర ప్రజల ఆశలు నెరవేరిన చారిత్రాత్మక ఘట్టం ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఐదు కోట్ల ఆంధ్రుల భావోద్వేగాలకు న్యాయం చేసింది. అమరావతి అభివృద్ధితో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది. రైతుల త్యాగాలకు గౌరవం లభించిన రోజు ఇది. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన…

Read More

సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఆయన విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకలకు MRPS, MSPతో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ ఆశయాలు, సమానత్వ సందేశం మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడైన జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆలోచనలను నేటి తరానికి చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు అన్నారు. అందువల్ల అందరూ వీలైనంత వరకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా MRPS సీనియర్ నాయకులు మాచర్ల దానియల్ మాదిగ, మండల ఇంచార్జి మాచర్ల రూబెన్ మాదిగ సంయుక్తంగా పిలుపునిచ్చారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేవతలు నడయాడిన దివ్య భూమి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. అమరావతిని ఏపీకి శాశ్వత, ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ఉభయ సభల్లో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శనివారం వెల్దుర్తిలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చి, కూటమి పార్టీల శ్రేణులకు మిఠాయిలు పంచారు. దీపాలు వెలిగించి, అమరావతి ఎప్పటికీ వెలుగొందుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More

ఏపీ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించిన ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. “జై అమరావతి” నినాదాలతో కార్యక్రమం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ కేక్ తినిపించి వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు ఎమ్మెల్యే.

Read More

వెల్దుర్తి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.అర్జీలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే, ఆయన ప్రశాంతంగా విని తక్షణ చర్యలు తీసుకోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

Read More

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెల్దుర్తి టీడీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.గత ఐదు సంవత్సరాల్లో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని, కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.“తప్పుడు కేసులు మాది కాదు… మీ పాలనలోనే మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు… చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం…” అని స్పష్టం చేశారు. అదేవిధంగా కండ్లకుంట – కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామాల మధ్య అక్రమంగా చెరువు ఏర్పాటు చేసి ప్రభుత్వ కరెంటుతో నీళ్లు అమ్ముకున్నారని ఆరోపించారు. భూకబ్జాలు, బినామీల వివరాలు త్వరలో బయటపెడతామని హెచ్చరించారు.“మీ అక్రమాలన్నీ బయటపెడతాం… ప్రజలను మోసం చేసిన వారిని వదిలిపెట్టం…” అని ఎమ్మెల్యే తీవ్రంగా వ్యాఖ్యానించారు.మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించిన ఆయన… అక్రమ చర్యలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.వరిక పుడిసెల…

Read More