
మాచర్ల: సామాజిక సేవా కార్యక్రమాల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తమవంతు భాగస్వామ్యం చూపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు.
ఆదివారం స్థానిక కేసీపీ రోడ్డులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పూర్తితో “మన మాచర్ల – మన బ్రహ్మారెడ్డి” పేరుతో టీడీపీ మైనారిటీ యువ నాయకుడు షేక్ మోసిన్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా చిరు వ్యాపారులకు 10 తోపుడు బండ్లను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి అర్హులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నిరుపేద వీధి వ్యాపారుల కోసం మోసిన్ అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నిరుపేద వీధి వ్యాపారుల కోసం మోసిన్ అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
