
పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామంలో భూముల రీ-సర్వే కార్యక్రమంపై గ్రామ సభ మరియు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ , మండల సర్వేయర్, స్పెషల్ ఆఫీసర్ & MPDO, గ్రామ సర్వేయర్లు, VRO, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు.

భూముల రీ-సర్వే ప్రక్రియ, దాని ప్రయోజనాలు, భూమి హక్కుల స్పష్టత, రికార్డుల సరిదిద్దడం వంటి అంశాలపై అధికారుల ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.
గ్రామంలో భూముల వివాదాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ రీ-సర్వే కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
