Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా | మాచర్ల నియోజకవర్గందుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దుర్గి పోలీసుల ఆకస్మిక దాడి నిర్వహించారు.ఎస్సై సుధీర్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో సంక్రాంతి రామానుజమ్మ వద్ద నుంచి సుమారు అరకేజీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More

ఒక చిన్న అబ్బాయి సైకిల్ తొక్కుతూ వెళ్తూ, రోడ్డుపక్కన నిలిపి ఉన్న ఒక బైక్‌ను పొరపాటున బలంగా ఢీకొట్టాడు. దాంతో బైక్ నంబర్ ప్లేట్ విరిగిపోయింది.భయపడినా… అక్కడి నుంచి పారిపోలేదు. యజమాని ఎప్పుడు వస్తాడా అని అదే చోట వేచి చూశాడు.యజమాని రాగానే జరిగినదంతా నిజాయితీగా చెప్పి,“నావల్లే విరిగింది… నా దగ్గర ఉన్నవి ఇవే, కొత్తది పెట్టించుకోండి… సారీ” అంటూ తన చిల్లర డబ్బులు ఇవ్వబోయాడు.ఆ చిన్నారి నిజాయితీ చూసి యజమాని మనసు కరిగిపోయింది. డబ్బులు తీసుకోకుండా, ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడాడు.ఆ వయసులోనే నిజాయితీ… అతను ఇంట్లో నేర్చుకున్న విలువల ప్రతిబింబం.పారిపోవడం సులువు…కానీ నిజం చెప్పడం, తప్పు ఒప్పుకోవడం, అక్కడే నిలబడటం — అదే నిజమైన ధైర్యం.

Read More

మాచర్ల డివిజన్ ఆఫీస్ కార్యాలయంలో గౌరవ సూపరింటెండింగ్ ఇంజనీర్ పల్నాడు డా. పి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ బి. వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. సింగయ్య పాల్గొన్నారు.సమావేశంలో ముఖ్యంగా విద్యుత్ రెవెన్యూ కలెక్షన్లు మరియు ఇతర విభాగాలకు సంబంధించిన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది వినియోగదారులతో మమేకమై, వారికి డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సేవలను ఎటువంటి జాప్యం లేకుండా అందించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఈ సమావేశానికి డివిజన్ పరిధిలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు హాజరయ్యారు.

Read More

మాచర్ల పట్టణంలోని 9వ వార్డులో పీపుల్ ఇన్ నీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బోర్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలపై నాయకులు చర్చించారు.ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు కూడా హాజరై, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.స్థానిక ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.

Read More

మాచర్ల పట్టణంలో సేవా కార్యక్రమంగా కృత్రిమ పాదాల ఎంపిక శిబిరం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల, వాసవి క్లబ్ ఆఫ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో, కెసిపి సిమెంట్ ఫ్యాక్టరీ సహకారంతో, ఎన్.ఆర్.ఐ.వి.ఏ ఫౌండేషన్ పూర్తి ఆర్థిక సహాయంతో ఈ శిబిరం డాక్టర్ వి.ఎల్. దత్ ఆడిటోరియంలో జరిగింది.కార్యక్రమాన్ని కెసిపి సీనియర్ జనరల్ మేనేజర్ వి. వెంకటరమణ, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 డిసీజ్ అండ్ ప్రివెన్షన్ చైర్మన్ డాక్టర్ కొండవీటి రామకోటయ్య, డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఇక్కుర్తి శంకర్, వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ ఓరుగంటి చెన్నకేశవరావు, మున్సిపల్ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఎన్నారై పంతంగి లక్ష్మీనారాయణ సమక్షంలో ప్రారంభించారు.ఈ శిబిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం నుండి వచ్చిన రంగారావు, సాంబశివరావు, నరేంద్రల సాంకేతిక బృందం సహాయంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 150 మందికి పైగా దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కృత్రిమ పాదాలు అమర్చేందుకు కొలతలు తీసుకున్నారు.ఈ…

Read More

మాచర్ల నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిలర్ల పదవీకాలం నేటితో ముగియనుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి శ్రీమతి పిన్నెల్లి రమా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా పిన్నెల్లి రమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా సామాన్య ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పరంగా ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. గత 20 నెలలుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు వచ్చినా పార్టీని నమ్ముకుని నిలిచిన ప్రతి మున్సిపల్ కౌన్సిలర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో పార్టీకి, పిన్నెల్లి సోదరులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Read More

దుర్గి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పాఠశాల పరిసరాలు, వంటగది, మధ్యాహ్న భోజనానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను స్వయంగా పరిశీలించిన ఆయన, విద్యార్థుల హాజరు రిజిస్టర్, ఉపాధ్యాయుల డ్యూటీ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఉపాధ్యాయులను ప్రశ్నించడంతో పాటు, ఉన్నతాధికారులకు నేరుగా ఫోన్ చేసి పాఠశాల పరిస్థితులు, ఉపాధ్యాయుల విధుల గురించి వివరించారు.అలాగే స్నానాల గదులు, మరుగుదొడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టి, పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశించారు.తదుపరి విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు.“మళ్లీ పాఠశాలకు వస్తాను.. ఆ సమయానికి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలి” అని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే…

Read More

మాచర్ల అభివృద్ధి ప్రదాత జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని 10వ వార్డు మరియు 8వ వార్డుల్లో గల మసీదుల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇమామ్లు, మౌజాన్లకు కొత్త బట్టలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మద్దిగపు బుల్లి రెడ్డి, భాగం హనుమంతరావు (86వ బూత్ ఇంచార్జ్), దాసు (98వ బూత్ ఇంచార్జ్), డేరంగుల డేవిడ్ రాజ్ (96వ బూత్ ఇంచార్జ్) పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని 10వ వార్డు, 63వ బూత్ ఇంచార్జ్ షేక్ జానీ భాష ఆధ్వర్యంలో నిర్వహించారు.

Read More

దుర్గి మండలంలో ట్రాక్టర్–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఓబులేశునిపల్లె గ్రామం వద్ద ఉన్న మొక్కజొన్న ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో జరిగింది.వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం శతకోడు గ్రామానికి చెందిన కంచిపోగు దావీదు (25), తండ్రి యోబు, జీవనోపాధి కోసం వలసగా వచ్చి గురజాల మండలం మాడుగుల గ్రామంలో నివసిస్తూ మొక్కజొన్న పనులు చేసుకుంటున్నాడు. ఇదే గ్రామం నుండి సుమారు 100 మంది పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు సమాచారం.సోమవారం తన బంధువును శతకోడు గ్రామానికి తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా, ఓబులేశునిపల్లె సమీపంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని ట్రాక్టర్‌ను ఢీకొనడంతో బైక్‌పై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సుధీర్ కుమార్ పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు…

Read More

పల్నాడు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో పాసు పుస్తకాల జారీ సమయంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒకరి పేరున్న భూమిని మరొకరి పేరుకు మార్చిన ఘటనలో అప్పటి తహశీల్దార్లు ప్రవీణ్, ఫనీంద్ర కుమార్ మరియు VRO కోటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటూ వారి ఇంక్రిమెంట్లపై కోత విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి జేసీ శ్యాం ప్రసాద్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More