
పల్నాడు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో పాసు పుస్తకాల జారీ సమయంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒకరి పేరున్న భూమిని మరొకరి పేరుకు మార్చిన ఘటనలో అప్పటి తహశీల్దార్లు ప్రవీణ్, ఫనీంద్ర కుమార్ మరియు VRO కోటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటూ వారి ఇంక్రిమెంట్లపై కోత విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి జేసీ శ్యాం ప్రసాద్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
