పల్నాడు జిల్లా | మాచర్ల నియోజకవర్గం
దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దుర్గి పోలీసుల ఆకస్మిక దాడి నిర్వహించారు.
ఎస్సై సుధీర్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో సంక్రాంతి రామానుజమ్మ వద్ద నుంచి సుమారు అరకేజీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
