Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలపై కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాలపై మొత్తం రూ.3,00,82,562 మేర ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా PWD విభాగం రూ.1,17,74,827, తాలూకా కార్యాలయం (ఎంఆర్వో కార్యాలయం) రూ.74,59,805, R&B భవన కార్యాలయం రూ.27,63,849, ఎస్‌సి కార్పొరేషన్ రూ.19,80,299, ప్రభుత్వ ఆసుపత్రి రూ.11,36,211 వంటి శాఖలపై ఎక్కువ బకాయిలు ఉన్నట్లు తెలిపారు.అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్‌మెంట్‌పై రూ.44,01,097, పోస్ట్ ఆఫీస్ భవనంపై రూ.24,20,383 మేర బకాయిలు ఉండగా, మొత్తం రూ.68,21,480 చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.ఈ బకాయిలు చెల్లించాల్సిందిగా సంబంధిత శాఖలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ వేణుబాబు తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రజల నుంచి కూడా సుమారు రూ.6 కోట్ల ఆస్తి…

Read More

నో స్మోకింగ్ డే సందర్భంగా మాచర్ల మున్సిపాలిటీ ప్రజలకు అవగాహన కల్పించింది. పొగత్రాగడం కేవలం ధూమపానం చేసే వ్యక్తికే కాకుండా అతని చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలు మరియు ఇతరులకు కూడా హానికరమని అధికారులు తెలిపారు.పాసివ్ స్మోకింగ్ వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచించారు. బస్టాండ్లు, పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ ధూమపానాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వేణుబాబు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ పట్టుబడితే నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించారు.“పొగ త్రాగడం వదులు.. ప్రాణాన్ని నిలుపు” అంటూ ఆరోగ్యకరమైన, పొగరహిత మాచర్ల నిర్మాణానికి ప్రజలు సహకరించాలని మున్సిపాలిటీ అధికారులు పిలుపునిచ్చారు.

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లిలోని విజయభాస్కర్ కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) మాచర్ల మరియు పల్నాడు సర్కిల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, నరసరావుపేట అధికారులు హాజరై దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాల ఆపరేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రెవెన్యూ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల అధికారులకు మరియు ఆపరేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.అలాగే వినియోగదారులకు పవర్ ఇంటరప్షన్ లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపరేషన్ సిబ్బంది తమ తమ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.అదేవిధంగా మీటర్ లేకుండా విద్యుత్ వినియోగం చేయవద్దని, విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమని తెలిపారు. తనిఖీలలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ…

Read More

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా ప్రగతి, అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం గురించి కూడా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని రైతుల సమస్యలు, రహదారుల విస్తరణ, ప్రసిద్ధి గాంచిన దేవాలయాల అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పించే పారిశ్రామిక అభివృద్ధిపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని సుద్ధగుంటల 7వ వార్డుకు చెందిన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని, టిడిపి కార్యకర్త కత్తుల వెంకట నారాయణ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు సహాయం అందించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు, కత్తుల వెంకట నారాయణకు రూ.15,000 నగదు సహాయం తో పాటు నిత్యావసర బియ్యం మరియు ఇతర సరుకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాకుమాను సైదా (సత్తెనపల్లి), కృష్ణవేణి కాలేజీ ప్రిన్సిపాల్ వై.వి. వెంకట రామయ్య , బండ్ల బ్రహ్మం , వెల్ననంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లింది.అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి నల్లవాగు కాలువలోకి దూసుకెళ్లినట్లు సమాచారం.ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో వారిని బయటకు తీసి అత్యవసర చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా గురజాల ఆర్డీవో మురళీకృష్ణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 18వ తేదీతో ముగియనుండటంతో, పాలనలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నూతన పాలకవర్గం ఏర్పడే వరకు మాచర్ల పురపాలక సంఘ పరిపాలన ప్రత్యేక అధికారిగా నియమితులైన గురజాల ఆర్డీవో మురళీకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగనుంది. ఈ సందర్భంగా మున్సిపల్ పరిపాలనలో అన్ని పనులు యథావిధిగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది పండుగ సందర్భంగా 2.50 లక్షల మంది లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తరఫున లబ్ధిదారులకు అధికారిక లేఖలు అందజేయాలని అధికారులకు సీఎం సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక సరఫరా జరగాలని సీఎం స్పష్టం చేశారు. ఇసుకపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ ఇండియా సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలు త్వరగా అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. భారత్ జెన్, నెక్స్ జెన్, ఐబీఎం వంటి సంస్థలు ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభం అయ్యేలా చూడాలని సూచించారు.అలాగే ఏఐ ఆగ్రానమిస్ట్, ఏఐ ట్యూటర్, ఏఐ డాక్టర్ వంటి సేవలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం…

Read More

పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిధిలో రెండు రోజుల క్రితం అడిగొప్పల తిరునాళ్లకు వెళ్తూ విష్ణు అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో పాటు ఎక్కువగా రక్తస్రావం జరిగింది.ప్రస్తుతం విష్ణు నరసరావుపేటలోని జీబీఆర్ (GBR) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి AB+ve బ్లడ్ అత్యవసరంగా అవసరమని బంధువులు, స్నేహితులు మీడియాకు తెలియజేశారు.ఈ సమాచారానికి స్పందించిన చింతపల్లి గ్రామానికి చెందిన యువకుడు త్రినాథ్ ముందుకు వచ్చి నరసరావుపేటలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాడు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని ఆయన తెలిపారు.త్రినాథ్ చేసిన ఈ సేవకు విష్ణు బంధువులు, స్నేహితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read More