మాచర్ల టౌన్లోని గర్ల్స్ హై స్కూల్ మరియు సెయింట్ ఆన్స్ గర్ల్స్ స్కూల్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరాటే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని అర్బన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఐ వెంకటరమణ మాట్లాడుతూ, మహిళలు స్వీయ రక్షణలో దిట్టలు కావాలని, ప్రతి అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనే ధైర్యం ప్రతి ఒక్కరికీ ఉండాలని తెలిపారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని కూడా పెంచుతాయని చెప్పారు.అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.…
Author: myapnews9@gmail.com
కారంపూడిలోని ఏపీ మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు భారత సేవా సహకార సంస్థ సభ్యుడు రవి కిరణ్ బుక్ ఫైల్స్ను పంపిణీ చేశారు. రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని బుధవారం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనాలని, మంచి ఫలితాలు సాధించాలంటే క్రమశిక్షణతో చదవాలని సూచించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ చక్ర సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, అబ్దుల్ కలాం, పీవీ నరసింహారావు వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. దేశభక్తితో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. సుహాసిని, ప్రధానోపాధ్యాయులు శ్రీ రాధాకృష్ణమూర్తి, శ్రీ నాగేశ్వరరావు, శ్రీ బాబురావు, పదవ తరగతి అధ్యాపక బృందం రామకృష్ణ, రవిప్రసన్న,…
మన పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామానికి సమీపంలో, పొందుగల వెళ్లే రోడ్డులో ఉన్న అయ్యవారిపాలెం శివారు ప్రాంతంలో వెలసిన అతి ప్రాచీన శివాలయం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.బొబ్బ నాగమ్మ నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పైబడి చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పురావస్తు శాఖ పరిధిలో ఉన్నప్పటికీ పునరుద్ధరణ పనులు జరగలేదు. అయితే ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమవడం పల్నాడు ప్రజలకు ఆనందకర విషయం.ఈ ఆలయంలో శివదేవుని విగ్రహం సాధారణంగా ఇతర శివాలయాల్లో కనిపించే లింగరూపంలో కాకుండా భిన్న రూపంలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఈ దేవాలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, చారిత్రక గుర్తింపును తీసుకొస్తోంది.ఇలాంటి మహిమాన్వితమైన పురాతన దేవాలయాలు పల్నాడు ప్రాంతానికి సొంతం కావడం గర్వకారణం. చారిత్రకంగా వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి, ఇలాంటి దేవాలయాలను…
రేపల్లె నియోజకవర్గ రాజకీయాలలో ఊహించని అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రముఖ వ్యాపారవేత్త పీట నాగకృష్ణమోహన్ను నియమించారు.పీట నాగకృష్ణమోహన్ నియామకంపై ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయనకు ఈ బాధ్యతలు రావడం పార్టీకి కొత్త ఊపునిస్తుందని అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ నియామకంపై పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరిన నేపథ్యంలో నియోజకవర్గ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.మోపిదేవి వలస అనంతరం ఈవూరు గణేష్కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించగా, కార్యకర్తలు క్రమంగా ఒక దారికి వస్తున్న సమయంలో ఈ కొత్త మార్పు ఆసక్తి రేపుతోంది. అటు టిడిపి, ఇటు వైసీపీ మధ్య రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో…
గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా కొనసాగుతోంది. వినుకొండ పరిసర గ్రామీణ ప్రాంతాల్లో గ్రహణం మొదలైన వేళ రోకలి బండను రోలుపై నిలబెట్టే ఆనవాయితీ కనిపించింది.పెద్దలు చెబుతున్న విశ్వాసం ప్రకారం గ్రహణం సమయంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరిహద్దులో ఉండటంతో గురుత్వాకర్షణ ప్రభావం మారుతుందని, అందువల్ల రోకలి బండ సులభంగా నిలబడుతుందని భావిస్తారు. ఈ సందర్భంగా కొందరు ఇళ్ల ముందు, మరికొందరు వీధుల్లో రోకలిని నిలబెట్టి ఆసక్తిగా గమనించారు.అయితే శాస్త్రీయంగా చూస్తే రోకలి బండ సమతుల్యంగా ఉంచితే ఎప్పుడైనా నిలబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ గ్రహణం సమయంలో రోకలి నిలబెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రత్యేక విశేషంగా మారింది.గ్రహణం సందర్భంగా ప్రజలు పలు ఆచారాలను పాటిస్తూ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.
నియోజకవర్గ పరిధిలో గుంటలు పడి అధ్వానంగా మారిన రోడ్లకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభించనుంది. రోడ్ల ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసింది.రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి–తుమృకోట–పశర్లపాడు రోడ్ల అభివృద్ధికి రూ. 2.90 కోట్లు కేటాయించగా, మాచర్ల మండలం అనుపు రోడ్డుకు రూ. 10 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని మంగళవారం శాసనసభ్యుల కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రోడ్ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మాచర్ల నుంచి గన్నవరం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.మండల పరిధిలోని గన్నవరం గ్రామానికి చెందిన దగ్గుల రామకృష్ణారెడ్డి ద్విచక్రవాహనంపై కంభంపాడు దాటి గన్నవరం వైపు వెళ్తుండగా రహదారిపై అకస్మాత్తుగా గేదెలు రావడంతో వాహనం నియంత్రణ తప్పి స్కిడ్ అయింది. దీంతో ఆయన కిందపడిపోయి తీవ్ర గాయాలు పొందినట్లు సమాచారం.స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రామకృష్ణారెడ్డిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అరెస్టు చేసిన అంగన్వాడీ యూనియన్ నాయకులను వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాచర్ల అంగన్వాడీ యూనియన్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అరకొర వేతనాలతో మాతా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో “చలో విజయవాడ” కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పారు.చర్చలు సఫలం కాకపోవడంతో సోమవారం రాత్రి యూనియన్ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని, ఇది దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా ఆక్షేపించారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అలాగే రూ. 26 వేల కనీస వేతనం మంజూరు చేయాలని, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ…
