Author: myapnews9@gmail.com

మాచర్ల, మార్చి 13: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే మోదీ పాలన ప్రజలకు శాపంగా మారిందని ఆయన ఆరోపించారు.రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే గత 20 సంవత్సరాలుగా అమలులో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని విమర్శించారు.అదేవిధంగా ఇటీవల జరిగిన మోదీ–ట్రంప్ వాణిజ్య ఒప్పందం కారణంగా దేశ ఎగుమతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, పన్నులు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంటగ్యాస్, చమురు, ఎరువుల ధరలు పెరగడం వల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Read More

మాచర్ల, మార్చి 13: తెలుగు సాహిత్య ప్రముఖ కవయిత్రి మొల్ల గారి జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ డి. వేణు బాబు మాట్లాడుతూ తెలుగు సాహిత్య చరిత్రలో మొల్ల గారు విశిష్ట స్థానం సంపాదించుకున్న గొప్ప కవయిత్రి అని పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో “మొల్ల రామాయణం” రచించి తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవలు అందించారని తెలిపారు.మహిళలు కూడా సాహిత్య రంగంలో తమ ప్రతిభను చాటుకోగలరని మొల్ల గారు నిరూపించారని ఆయన అన్నారు. ఆమె రచనలు తెలుగు సంస్కృతి మరియు సాహిత్య సంపదను ప్రపంచానికి పరిచయం చేశాయని పేర్కొన్నారు.యువత మొల్ల గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని మొల్ల గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి…

Read More

పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 13వ శతాబ్దంలో పునర్నిర్మించబడిన ఈ దేవాలయం ఎంతో గొప్ప చరిత్ర కలిగినదని, మినీ మహాభారతం జరిగిన ప్రాంతంగా కూడా ఇది గుర్తింపు పొందిందని తెలిపారు. అయితే ఇంత చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న దేవస్థానం ఇప్పటివరకు సరైన రిపేర్లు కూడా పొందకపోవడం బాధాకరమని అన్నారు. ఈ చారిత్రాత్మక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు.రాబోయే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ తేదీన జరిగే రథోత్సవం ఎంతో ముఖ్యమైనదని, ఆ రోజు గ్రామ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి రథోత్సవాన్ని దర్శించుకుంటారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.అలాగే తెలుగుదేశం…

Read More

చెన్నకేశవ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష – భక్తులకు పోలీసుల సూచనలు పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో గురజాల ఇన్‌చార్జ్ డీఎస్పీ వెంకటరమణ మాట్లాడారు. తిరునాళ్ల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దర్శనం పూర్తైన తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలో ఎక్కువసేపు ఉండకుండా త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.అదేవిధంగా గతంలో ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని, భక్తులు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనంగా మరికొన్ని పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ తిరునాళ్ల సమయంలో పట్టణంలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. మహిళలు అధికంగా బంగారు నగలు ధరించి రావద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని, రథోత్సవం వంటి వేడుకల సమయంలో…

Read More

పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ళ పై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి. వేణుబాబు పలు కీలక విషయాలను వెల్లడించారు.దేవాలయం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తిరుణాల సందర్భంగా మున్సిపాలిటీ నుంచి ఖర్చు చేయడానికి గతంలో రూ.75 వేలుగా ఉన్న నిధిని ఈ సంవత్సరం రూ.1 లక్షకు పెంచాలని మున్సిపల్ చైర్మన్ మధార్ సాహెబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.అదేవిధంగా చలువ పందిళ్లు, ఎలక్ట్రికల్ ఏర్పాట్లకు సంబంధించి దేవస్థానం తీర్మానాలను గౌరవ చైర్మన్‌కు అందజేసి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. పండుగ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పాతూరు మెయిన్ రోడ్‌తో పాటు పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం…

Read More

రెంటచింతలలో బొలెరో ప్రమాదం… 22 మందికి గాయాలుపల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గ పరిధిలోని రెంటచింతల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోర్నాల ప్రాంతం నుండి గురజాల మండలం గంగవరానికి మొక్కజొన్న కండలు విరచడానికి వెళ్తున్న కూలీలు ప్రయాణిస్తున్న బొలెరో (దోస్తు) వాహనం రెంటచింతల హైవేపై హోసన్న మందిరం సమీపానికి రాగానే అదుపుతప్పి కిందపడింది.డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల వాహనాన్ని సరిగా నడపకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వాహనంలో మొత్తం 25 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 22 మందికి గాయాలు అయ్యాయి.గాయపడిన వారిలో ఒక మహిళకు చెవుల నుండి రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లతో పాటు స్థానికుల సహాయంతో ఆటోల ద్వారా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది.ప్రమాదం అనంతరం వాహన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు…

Read More

ప్రభుత్వ ఉద్యోగి కుమారుడి అర్జీ పరిశీలనమాచర్ల పట్టణానికి చెందిన మందుల పుల్లారావు తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మెడికల్ ఇన్వాలిడేషన్ కింద ఆయన కుమారుడు మందుల మల్లిఖార్జున గోపి ఉద్యోగం కోసం మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.దీనిపై విచారణ నిమిత్తం మాచర్ల తహసీల్దార్ బి. కిరణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ కలిసి స్వయంగా పుల్లారావు నివాసానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం అర్హతల ఆధారంగా అర్జీదారుడికి ఉద్యోగం సిఫార్సు చేసే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు

Read More

మాచర్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావుకు చెందిన స్కార్పియో కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.దుండగులు కారుతో వచ్చి దుర్గారావు కారును అడ్డగించి, అద్దాలను పగలగొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో మాచర్ల పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మాట్లాడుతూ, మాచర్ల పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. అది చూసి ఓర్వలేక వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.తాను బజార్ నుంచి వస్తున్న సమయంలో కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారని తెలిపారు. గతంలో కూడా తన కారును దాడి చేసి తగలబెట్టారని, ఇటీవల ఫ్లెక్సీలు చించివేయడం వంటి ఘటనలు జరిగాయని…

Read More

మాచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్న 229 మంది విద్యార్థినీలకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మాచర్ల పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర బుక్ డిపో యజమాని షరాబు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బూసా రామాంజనేయులు (అడ్వకేట్) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినీలకు పరీక్షా సామాగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా షరాబు అనిల్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఉషారాణి, సీనియర్ ఉపాధ్యాయులు పోలా మల్లికార్జున, కృష్ణబాబు, శ్రీహరి, కొండలు, కటకం నరేష్, ఫారుక్, లక్ష్మణ్, నరసింహ సాయి తదితరులు పాల్గొన్నారు

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లి సబ్ డివిజన్ మరియు వీఆర్వో కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం గృహ వినియోగదారులందరికీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.ఈ పథకం ద్వారా ఒకసారి పెట్టుబడి పెట్టి 25 సంవత్సరాల పాటు ఇంటికి ఉచిత విద్యుత్ పొందవచ్చని, అలాగే ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్‌ను విద్యుత్ సంస్థలకు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చని వివరించారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలు ఇలా ఉన్నాయి:1 కిలోవాట్‌కు రూ.30,0002 కిలోవాట్‌కు రూ.60,0003 కిలోవాట్‌కు రూ.78,000అలాగే తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.అపార్ట్మెంట్‌లో నివసించే వారికి పర్సనల్ నెట్ మీటరింగ్ విధానం ద్వారా తమ సొంత ఇంటి పై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి, అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విద్యుత్ కంపెనీకి ఎక్స్‌పోర్ట్ చేసి అపార్ట్మెంట్‌లో వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు.సోలార్ రూఫ్‌టాప్…

Read More