
పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం.. పాలువాయి PACSలో మొక్కల నాటం ప్రారంభం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పాలువాయి PACS ప్రాంగణంలో సొసైటీ చైర్మన్ అల్లం నాగలక్ష్మి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల బ్రాంచ్ GDCC Bank మేనేజర్ కరుణాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
