
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులు తో కలిసి గ్రామంలో గడపగడపకు వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. లబ్ధిదారులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వృద్ధులు, విధవలు, వికలాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరికీ సమయానికి పింఛన్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
