
మాచర్ల: కృష్ణవేణి జూనియర్ కళాశాల మరియు ఎస్విఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి 100 మందికి పైగా ప్రజలు హాజరై తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పొందారు.
ఈ శిబిరంలో కేరళకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య సంస్థ శ్రీధరీయం ఆయుర్వేదిక్ పంచకర్మ వైద్యులు డాక్టర్ దిలీపన్ మరియు వారి సిబ్బంది పాల్గొని, రోగుల సమస్యలను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందించారు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరం ప్రజలకు ఉపయోగకరంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యనమదల వెంకట్రామయ్య, డైరెక్టర్లు సుబ్బారావు, శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతినెల నిర్వహించనున్నట్లు మేనేజర్ హుస్సేన్ తెలిపారు. మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్వాహకులు సూచించారు.
