Author: myapnews9@gmail.com

నాడు రజాకార్లకు ఎదురు నిలిచిన స్వాతంత్ర్య సమరయోధుడు… ఇప్పుడు కన్న కొడుకుల నిర్లక్ష్యానికి గురై వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్న ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.వలిగొండ గ్రామం కేశిపల్లికి చెందిన ఉంగరాల యాదగిరి (110) స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన, తర్వాత కష్టపడి 50 ఎకరాల భూమి సంపాదించుకున్నారు. యాదగిరికి భార్య లక్ష్మమ్మ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పదిహేనేళ్ల క్రితం మరణించారు.తర్వాత తన వద్ద ఉన్న 50 ఎకరాల భూమిలో నలుగురు కుమారులకు తలో 10 ఎకరాలు, ఇద్దరు కుమార్తెలకు చెరో 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అంతేకాకుండా కుమారుల ఇళ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు కూడా అందించారు.అయితే ఆస్తి పంచుకున్న తర్వాత కుమారులు యాదగిరిని పట్టించుకోవడం మానేశారని తెలుస్తోంది. ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపణలు ఉన్నాయి. దిక్కుతోచని…

Read More

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురజాల కోర్టు కొట్టివేసింది.దీంతో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగనున్నాడు. గుండ్లపాడు గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసు అప్పట్లో జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Read More

పట్టణంలోని స్థానిక నారాయణ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన లెడ్ కాన్ఫిడెన్స్ కార్యక్రమంలో తమ ప్రతిభను చాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ బి. వేణుబాబు, పల్నాడు జిల్లా క్లస్టర్ ప్రిన్సిపాల్ జానకిరామిరెడ్డి, ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి, ప్రీ ప్రైమరీ జిల్లా ఆర్ అండ్ డి ఇన్‌చార్జి మారియా, జెడ్ సివో రిహాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు విద్యార్థుల పట్ల అంకితభావంతో కూడిన విద్యా ప్రణాళికను అమలు చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా లెసన్ ప్లానింగ్ ద్వారా బోధన కొనసాగిస్తున్నట్లు చెప్పారు.పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా విద్యార్థులు నేర్చుకున్న విద్యను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, అతిథులకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రిహాని, ఇన్‌చార్జ్ రాజేశ్వరి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,…

Read More

మాచర్ల మండలం అలుగురాజుపల్లి వద్ద ఉన్న న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాంకేతిక విప్లవాన్ని తీసుకువస్తోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక విజ్ఞానం, నైపుణ్యాలతో కూడిన శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ఆయన తెలిపారు. సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకోవడం ద్వారా యువత ప్రపంచ స్థాయి పోటీలో ముందుండగలరని సూచించారు.విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలని, సమాజానికి ఉపయోగపడేలా తమ ప్రతిభను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More

మాచర్ల పట్టణంలోని వీవీఎన్ గార్డెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు ICAR – భారతీయ వరి పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక పథకం కింద వ్యవసాయ ఇన్పుట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన ఎస్టీ రైతులకు 400 బ్యాటరీ స్ప్రేయర్లు, 400 టార్పాలిన్ పట్టాలు ను మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు అందజేశారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు, మాచర్ల సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వి. జగదీశ్వర రెడ్డి, భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు డా. ఎం.బి.బి. ప్రసాద్ బాబు, డా. ఎం.ఎస్. అనంత, డా. వై. శ్రీధర్ పాల్గొన్నారు.అలాగే మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల వ్యవసాయ అధికారులు డి. పాప కుమారి, టి. బాలాజీ గంగాధర్, వై. అమీర్ రెడ్డి,…

Read More

సృష్టిలో తొలి స్థానం తల్లిదే – మహిళల అభివృద్ధికి టీడీపీ కృషి : ఎమ్మెల్యే జూలకంటి మాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సృష్టిలో మొదటి స్థానం తల్లిదేనని ఆయన అన్నారు. ప్రతి స్త్రీ ఒక మాతృమూర్తి అని, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.మన సంస్కృతిలో తల్లి, తండ్రి, గురువు, దైవం అనే క్రమంలో తల్లికి తొలి స్థానాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రతి బిడ్డకు తొలి గురువు తల్లేనని, చిన్నప్పటి నుంచే నడవడం, మాట్లాడడం వంటి జీవన విలువలను నేర్పేది తల్లేనని చెప్పారు.కుటుంబ వ్యవస్థలో గానీ, సమాజ వ్యవస్థలో గానీ మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ఒక మంచి అధికారి, సమాజ సేవకుడు, రాజకీయ నాయకుడు లేదా ఉద్యోగి సమాజానికి అందుబాటులోకి రావడానికి వారి వెనుక ఒక…

Read More

మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.మహిళల సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో మహిళలు ముందుకు వచ్చి తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు.సమాజ పురోగతికి మహిళల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొంటూ మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Read More

మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సఖి వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సీమంతం వేడుకల్లో పాల్గొని గర్భిణీ మహిళలకు దీవెనలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా నిర్వహించారు.అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ పాదాలు అందించేందుకు ఎంపిక శిబిరాన్ని ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఎన్ఆర్ఐవీఏ అమెరికా వారి ఆర్థిక సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఓరుగంటి చెన్నకేశవరావు, పఠాన్ నాగూర్ వలి శుక్రవారం వెల్లడించారు.పట్టణంలోని కెసిపి స్టోర్స్ పక్కన ఉన్న డా. వెలగపూడి లక్ష్మణ్ దత్ ఆడిటోరియంలో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కంభం రోటరీ ట్రస్ట్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, కెసిపి లిమిటెడ్ మాచర్ల వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.మాచర్లతో పాటు పరిసర గ్రామాల వికలాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పేర్ల నమోదు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.ముందస్తు నమోదు కోసం 9849065882, 9440002432 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Read More

పలనాడు ప్రాంత ప్రజల ఇలవేల్పుగా పేరుగాంచిన శ్రీ నిదానంపాటి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఘనంగా సన్మానించారు.అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పలనాడు ప్రాంత ప్రజలకు నిదానంపాటి అమ్మవారు ఎంతో ఆరాధ్య దేవతగా నిలిచారని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తిరునాళ్ల నిర్వహణకు కృషి చేస్తున్న దేవస్థాన కమిటీ సభ్యులను అభినందించారు.

Read More