పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో 21వ వార్షికోత్సవ వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల ఉల్లాసం, ఉత్సాహం, కెరింతల మధ్య వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు, డైరెక్టర్ కోమటినేని నాసరయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ జానపద గాయకుడు డాక్టర్ కళాశ్రీ భిక్షు నాయక్, ప్రముఖ టీవీ యాంకర్ మరియు సింగర్ కే.బీ.ఎన్. సుజ శ్రీ, ప్లేబ్యాక్ సింగర్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ నాగేందర్ రాథోడ్, రేలా ఓ రేలా సింగర్ ఉష అక్క హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్యే జీవితంలో విజయానికి దారి తీస్తుందని అన్నారు.అతిథుల పాటలు, మిమిక్రీ ప్రదర్శనలు, అలాగే విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక…
Author: myapnews9@gmail.com
పల్నాడు జిల్లా వినుకొండలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూ నిర్మిస్తున్న గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను రాష్ట్ర చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు.భక్తుల సౌకర్యార్థం మరియు పర్యాటకాభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ రహదారి పనుల పురోగతిని ఆయన పరిశీలించి, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.ఏళ్ల తరబడి భక్తులు ఎదురుచూస్తున్న గిరి ప్రదక్షిణ మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా, నాణ్యతతో కూడిన రహదారి నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీమతి డి. పాప కుమారి రైతులకు ముఖ్య సూచనలు చేశారు. రబీ 2025–26 సీజన్కు సంబంధించిన ఈ-క్రాప్ పంట నమోదు డ్రాఫ్ట్ జాబితాలను మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు.మాచర్ల మండల పరిధిలోని రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి పంట నమోదు జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు. నమోదు వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే ఈ నెల 14వ తేదీ లోపు రైతు సేవా కేంద్రాల్లో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులకు గ్రీవెన్స్ అందజేసి సరిచేసుకోవాలని కోరారు.రైతులు తప్పనిసరిగా జాబితాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనులపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం.ఏసీబీ అధికారులు సంబంధిత అధికారుల కార్యాలయాల్లో పత్రాలను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 25 గొర్రెలు మృతి చెందాయి.వివరాల ప్రకారం… పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న ఒక లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. దీంతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని వాపోయారు.సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఖరీదైన మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రీమియం బ్రాండ్ల ధరలు అధికంగా ఉండటంతో వాటిని తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.ప్రస్తుతం ఏపీలో విదేశీ మరియు ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల కంటే వేల రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఫారిన్ లిక్కర్ సీసా తెలంగాణలో సుమారు రూ.22 వేల వరకు ఉంటే, అదే సీసా ఏపీలో రూ.25 వేలకుపైగా ఉంది. మరికొన్ని బ్రాండ్ల విషయంలో ఈ వ్యత్యాసం రూ.27 వేల నుంచి రూ.33 వేల వరకు ఉందని సమాచారం.ఈ ధరల వ్యత్యాసం కారణంగా పలువురు మందుబాబులు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తెచ్చుకుంటున్నారని అధికారులు గుర్తించారు. దీని వల్ల రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలో దాదాపు 20 రకాల ప్రీమియం…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారిపై అధికారులు కాలవలు తవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.మాచర్ల ప్రధాన రహదారిపై ఉన్న ఒక కాలేజీ ముందు కాలవ తవ్వడంతో పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్నపాటి తాత్కాలిక వంతెనను దాటడం కూడా కష్టంగా మారింది.దీంతో పలువురు విద్యార్థులు కాలేజీ ప్రాంగణానికి చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షల సమయంలో ఇలాంటి పనులు చేయడం వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై అధికారులు స్పందించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి గేటు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడుగు హనుమాయమ్మ కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే హనుమాయమ్మను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.మృతురాలి కుమారుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇంట్లో జరిగిన కుటుంబ కలహాల కారణంగా తన తల్లి పురుగుమందు తాగినట్లు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్పల్నాడు జిల్లామాచర్ల నియోజకవర్గం దుర్గి సమీపంలో ఆటోలు ఢీ… ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్రం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. వివరాల ప్రకారం… దుర్గి నుంచి పోలేపల్లి గ్రామానికి కూలీలతో వెళ్తున్న ఒక ఆటో, పోలేపల్లి నుంచి జంగమేశ్వరంపాడు గ్రామానికి కూలీలను తీసుకుని వెళ్తున్న మరో ఆటో దుర్గి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోల్లో ఉన్న పలువురు కూలీలు గాయపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
