
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి పట్టణం సినీ పక్కిలో సోమవారం ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోనే బహిరంగంగా ఒక వ్యక్తిపై దుండగులు దాడి చేసి, సుమారు కేజీ బంగారాన్ని దోచుకెళ్లడం కలకలం రేపింది.
వినుకొండకు చెందిన బంగారు వ్యాపారి యక్కల శ్రీనివాసరావు ప్రతి సోమవారం మాదిరిగానే కారంపూడిలోని పలు జ్యువెలరీ షాపులకు బంగారు ఆభరణాలు సరఫరా చేయడానికి వచ్చాడు. అతని రూటీన్ను గమనించిన దుండగులు ముందుగానే పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సినీ పక్కిలో అనుకూల సమయం చూసుకుని రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు మొదట శ్రీనివాసరావుపై దాడి చేశారు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా, కొద్దిసేపటికే మరోసారి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతని వద్ద ఉన్న సుమారు కేజీ బంగారు ఆభరణాలను లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు
రక్తస్రావంతో కిందపడిపోయిన బాధితుడు తేరుకున్న వెంటనే కారంపూడి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడంతో పాటు, దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
మధ్య పట్టణంలోనే ఇలాంటి ఘటన జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రక్తస్రావంతో కిందపడిపోయిన బాధితుడు తేరుకున్న వెంటనే కారంపూడి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడంతో పాటు, దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
మధ్య పట్టణంలోనే ఇలాంటి ఘటన జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
