
గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరు నుంచి అర్ధరాత్రి విజయవాడకు చేరుకున్న ఓ యువతి, బస్టాండ్లో ఆటో ఎక్కగా డ్రైవర్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు.
మంగళగిరి దాటిన తర్వాత చినకాకాని సమీపంలో ఆటోలోనే యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్, అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన యువతి వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.
అలర్ట్ అయిన మంగళగిరి గ్రామీణ పోలీసులు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పారిపోతున్న ఆటో డ్రైవర్ను ఎస్.ఐ. వెంకట్ వెంబడించి పట్టుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాధిత యువతిని సురక్షితంగా ఆమె స్వస్థలానికి చేర్చారు.
👉 ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
