
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే దేశ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని యాగంటి పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
ఎన్డీఏ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని ఆయన స్వాగతించారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పెంపు వంటి కీలక అంశాలకు ఆమోదం లభించాలని ఆకాంక్షించారు.
అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, వారికి చట్టసభల్లో మాట్లాడే అవకాశాలు కల్పించడం ద్వారా నారీ గళం మరింత బలపడుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తోందని, వారి అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తోందని తెలిపారు. అలాగే నియోజకవర్గాల పెంపు వంటి నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు తెలపాలని యాగంటి మరోసారి విజ్ఞప్తి చేశారు.
