
పల్నాడు జిల్లా – చిలకలూరిపేట :
చిలకలూరిపేట మండలం బొప్పూడి చెంచు కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోతముక్క ఆడుతున్నారన్న సమాచారం అందడంతో ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.31,500 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ, మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
