
మాచర్ల: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి సంబంధించి రూ.5 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన ప్రణాళికలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నమూనాల పునర్నిర్మాణంపై దేవస్థాన అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఆలయ పరిరక్షణతో పాటు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అలాగే, ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసి, భక్తుల రాకపోకలు పెరగడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
