
కారంపూడి మండలంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు.
మూడు రాజధానులు, మావిగన్ రాజధాని వంటి వ్యాఖ్యలు జగన్ మానసిక స్థితిని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నాయని ఆయన అన్నారు.
అభివృద్ధి పనులకు వైసీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
‘రప్పా రప్పా’ అంటూ చేస్తున్న హంగామాను ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మెగా డీఎస్సీ అమలును అడ్డుకోవడానికి జగన్ దాదాపు 100కి పైగా కోర్టు కేసులు వేసారని ఆరోపించారు.

అమరావతి రాజధాని అభివృద్ధిని ఎన్ని కుట్రలు చేసినా ఆపలేరని స్పష్టం చేశారు.
రూ.800 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
పూర్తి అనుమతులతో వరికపూడిశెల పనులు ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.
