
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త లక్ష్మయ్య, తన భార్య భూలక్ష్మీ (33)పై అనుమానం పెంచుకుని గొడ్డలితో దాడి చేసి ఆమె కాలు నరికిన దారుణం జరిగింది.
తీవ్రంగా గాయపడిన భూలక్ష్మీని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన అనంతరం లక్ష్మయ్య నరికిన కాలును గొనె సంచిలో వేసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
