
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తేనే రైతాంగం ప్రగతి సాధిస్తుందని టిడిపి యువ నాయకుడు గౌతమ్ జూలకంటి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పల్లె సృజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో “వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు” పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన గౌతమ్ జూలకంటి వ్యవసాయంలో వినియోగించే అధునాతన పరికరాలను పరిశీలించారు. తక్కువ ఖర్చుతో సులభంగా తయారు చేసిన యంత్రాల పనితీరును పరిశోధకులను అడిగి తెలుసుకున్నారు.
చిన్న వయసులోనే విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి జగదీశ్వర్ రెడ్డి, మాచర్ల మండల వ్యవసాయ అధికారి పాపకుమారి, పాఠశాల నిర్వాహకులు కృష్ణారెడ్డి, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
