
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలో ఓ తల్లి తన కూతురిని నడుముకి కట్టుకుని నాగార్జునసాగర్ కుడి కాలువలోకి దూకింది.
ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో విజయపురి సౌత్ ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. కొద్ది సేపటి గాలింపులోనే తల్లి, కూతురు మృతదేహాలు బయటపడినట్లు తెలిపారు.
మృతదేహాలను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు, ఈ ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
