
పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేట నుంచి వేములూరుపాడు వెళ్తున్న వ్యక్తి స్కూటీలో ఉంచిన సుమారు రూ.5 లక్షలు చోరీకి గురయ్యాయి.
నరసరావుపేట బైపాస్లోని జొన్నలగడ్డ హోల్సేల్ ఉల్లిపాయ దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన సమయంలో, బయట నిలిపిన స్కూటీలో ఉన్న నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు సమాచారం.
ఈ చోరీ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
