
మాచర్ల మండలం రాయవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు.
అమ్మవారిని వైభవంగా అలంకరించగా ఆలయం భక్తుల సందడి తో కిటకిటలాడింది. కార్యక్రమంలో భాగంగా సంప్రదాయబద్ధంగా కుంకుమ బండ్లకు పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.

గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. ఈ తిరునాళ్ల సందర్భంగా పలు ధార్మిక కార్యక్రమాలు, ప్రత్యేక సేవలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
