
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేవతలు నడయాడిన దివ్య భూమి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. అమరావతిని ఏపీకి శాశ్వత, ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ఉభయ సభల్లో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శనివారం వెల్దుర్తిలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చి, కూటమి పార్టీల శ్రేణులకు మిఠాయిలు పంచారు. దీపాలు వెలిగించి, అమరావతి ఎప్పటికీ వెలుగొందుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
