
మాచర్ల: యువగళం పాదయాత్ర సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం, వడ్డెర సమాజానికి మైనింగ్ రంగంలో 15% రిజర్వేషన్లు అమలు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు మాట్లాడుతూ, వడ్డెరల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడు కొమెర దుర్గారావు పాల్గొన్నారు.
