
పల్నాడు జిల్లా: నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను మోసం చేసిన ఘటనపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, 8వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికతో ఒక యువకుడు పరిచయం పెంచుకుని, మాయ మాటలు చెప్పి ఆమెను ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షేక్ షాహిద్ (17) అనే యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, మైనర్లపై జరిగే ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

