ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రశాంత వాతావరణం అవసరమని ఎమ్మెల్యే జూలకంటి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో నెలకొన్న విభేదాలపై ఇరు వర్గాలను పార్టీలకు అతీతంగా పిలిపించి చర్చించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఐకమత్యంతో ఉండాలని, ఫ్యాక్షన్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ముఠా తగాదాల వల్ల గ్రామ అభివృద్ధి దెబ్బతింటుందని, వ్యక్తిగతంగా కూడా నష్టాలు కలుగుతాయని వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకుండా ముందుకు సాగాలని సూచిస్తూ, భవిష్యత్తులో ఫ్యాక్షన్ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే సూచనలు, సలహాలను స్వాగతించిన ఇరు వర్గాల నాయకులు పరస్పరం సమ్మతితో రాజీకి వచ్చారు. అనంతరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతూ మిఠాయిలు పంచుకుని సఖ్యతను చాటుకున్నారు.
ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ పొట్లపాటి చంద్రారెడ్డి, రెండవ సర్పంచ్ గోగుల చినపుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ గోగుల వెంకటేష్ రెడ్డి, గీదా సీతారామరెడ్డి, కెనాల్స్ చైర్మన్ మద్దిగపు పిచ్చిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గోగుల వెంకట్రామిరెడ్డి, నెమలి రంగారెడ్డి, గోగుల లక్ష్మారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మేకపోతుల పేర్రెడ్డి, పల్లెల రామిరెడ్డి, మద్దిగపు రామిరెడ్డి, స్వామిరెడ్డి, కోలగొట్ల బుల్లెబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
