
మాచర్ల మండలం రేగులవరం తండాలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సేవాలాల్ స్వామివార్ల ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల గౌరవ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి, శ్రీ సేవాలాల్ స్వామివార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
