
మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ క్యాటరింగ్ & కర్రీస్ పాయింట్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ యెనుమల కేశవరెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానికంగా స్వచ్ఛమైన ఆహారం, రుచికరమైన వంటకాలతో ప్రజలకు మంచి సేవ అందించాలని ఆకాంక్షించారు. కొత్తగా ప్రారంభమైన ఈ క్యాటరింగ్ సెంటర్ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, నాణ్యమైన ఆహారం అందించే కేంద్రంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని యజమానులను అభినందించారు.
