

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ గంధం మల్లయ్యను టిడిపి యువ నాయకులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి పరామర్శించారు.
మల్లయ్య నివాసానికి వెళ్లిన గౌతమ్ రెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయం ఎప్పుడైనా అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని గౌతమ్ రెడ్డి తెలిపారు.
