
ప్రధాన రహదారిపై పేరుకుపోయిన వ్యర్థాలను పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ అధికారులు, కూటమి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా తొలగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, “పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల సహకారంతోనే మాచర్లను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దగలం. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త బుట్టలను వినియోగించాలి. పారిశుధ్య కార్మికుల సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి” అని అన్నారు.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తీసుకొచ్చాయని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ప్రతి నెల నిర్వహిస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు ప్రజల్లో బాధ్యతాభావాన్ని పెంపొందిస్తున్నాయని తెలిపారు.
పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం కాపాడబడుతుందని, పారిశుధ్య నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
