పల్నాడు జిల్లా | మాచర్ల నియోజకవర్గం:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని మాచర్ల ఆర్టీసీ బస్టాండ్లో మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ను రూ.2000 నుంచి రూ.3000కు పెంచేందుకు ఐదేళ్లు పట్టిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు, దివ్యాంగులకు అధిక మొత్తంలో పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని అన్నారు.రాష్ట్రం అప్పుల భారంలో ఉన్నప్పటికీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అయితే కొందరు రాజకీయ కారణాలతో కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ…
Author: myapnews9@gmail.com
అమరావతి:రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి మరో ముందడుగు వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.పథకం ప్రారంభ సందర్భంగా మంగళగిరి బస్టాండ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర బస్సులో ప్రయాణిస్తూ దివ్యాంగులతో మమేకమయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా దివ్యాంగుల సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు కల్పిస్తున్న సదుపాయాలపై వారు వివరించారు.పథకం ప్రారంభోత్సవానికి భారీగా ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్ధిదారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అమరావతి:ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది.ఈ పథకం ప్రకారం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. వీరికి ప్రత్యేకంగా ‘జీరో టికెట్’ జారీ చేస్తారు.దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు (Escorts) టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. గతంలో కేవలం నాలుగు వర్గాలకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు 21 రకాల వైకల్యాల వరకు విస్తరించారు, దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.16 లక్షల మందికి లాభం చేకూరనుంది. ఇప్పటికే ఉన్న రాయితీ పాస్లు చెల్లుబాటు అవుతాయి. కొత్తగా పాస్ పొందాలనుకునే వారు SADAREM సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో…
గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు:గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటున్న పదో తరగతి విద్యార్థి చెరువులో పడి మృతి చెందాడు.మృతుడు మండల రాజేష్ (18)గా గుర్తించారు. అతను మాచర్ల మండలం నాగులవరం గ్రామానికి చెందిన మండల రామయ్య, లింగమ్మల కుమారుడు. వట్టిచెరుకూరు బీసీ హాస్టల్లో ఉంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 16న జరిగిన తెలుగు పరీక్ష సరిగా రాయలేదన్న మనస్తాపంతో రాజేష్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. వార్డెన్, వాచ్మన్ అతనికి ధైర్యం చెప్పినప్పటికీ, ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం.అయితే మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా వట్టిచెరుకూరు సీఐ రామా నాయక్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. పరీక్షల విషయంలో భయాందోళనలకు గురై ఎలాంటి…
వెల్దుర్తి:వెల్దుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ,“ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలవాలనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ను అమలు చేస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇది గొప్ప సహాయం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం:రెంటచింతల మండలం గోలి గ్రామ సమీపంలోని గోలి వాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. వాగు దాటే ప్రజలు, ముఖ్యంగా రాత్రి సమయంలో వెళ్లే వారు ఆందోళన చెందుతున్నారు.విషయం తెలుసుకున్న తహశీల్దార్ మేరి కనకం వెంటనే స్పందించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అదేవిధంగా, వాగు పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారి ఎస్సై మన్మోహన్ ప్రసాద్ ప్రజలను అప్రమత్తం చేశారు. వాగు వద్దకు వెళ్లే మహిళలు, విద్యార్థులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు.మొసలి సంచారం నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పల్నాడు జిల్లా – నరసరావుపేట:నరసరావుపేటలో టిడిపి-జనసేన మధ్య నెలకొన్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటివరకు ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న విభేదాల్లోకి తాజాగా బీజేపీ కూడా ప్రవేశించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.బీజేపీ ఇన్చార్జ్ రంగిశెట్టి రామకృష్ణ, జనసేన ఆరోపణల వెనుక స్థానిక ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ఉందని బహిరంగంగా ఆరోపించడం హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యాఖ్యలతో ఎంపీ-ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ మరోసారి వెలుగులోకి వచ్చింది.“నరసరావుపేటలో కొందరు ఎమ్మెల్యే వద్దు, ఎంపీ ముద్దు అన్నట్లు వ్యవహరిస్తున్నారు” అని రంగిశెట్టి విమర్శించారు. అంతేకాకుండా, బహిరంగ వేదికపై సొంత పార్టీ ఎంపీపై విమర్శలు చేస్తున్నప్పటికీ, ఎమ్మెల్యే అరవిందబాబు వారించకపోవడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.జనసేన పార్టీ చేసిన త్యాగాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటో వివరించాలని సవాల్ విసిరిన రంగిశెట్టి, “జనసేనకు హైకమాండ్ వైసీపీనే” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.అదే సమయంలో జనసేనలో ఎక్కువగా కాపు సామాజికవర్గానికి చెందిన…
📍 మాచర్ల:పట్టణంలోని రూప్లైన్ కాలనీ, 8వ వార్డులో మాచర్ల రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న వాహనాలు, వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మొత్తం 33 బైకులు, రెండు ఆటోలుతో పాటు గడ్డపారలు, గొడ్డళ్లు వంటి పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉన్నందున వీటిని జప్తు చేసినట్లు తెలిపారు. అనంతరం కాలనీలోని ప్రజలతో సమావేశమై, గంజాయి వంటి నిషేధిత పదార్థాల వినియోగం, ట్రాఫిక్ నియమాలు, ర్యాగింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. నేరాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమం ద్వారా కాలనీలో భద్రతా పరిస్థితులు మెరుగుపడటంతో పాటు, ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరిగిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. అమరావతిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం శావల్యాపురం మండలం కొత్తలూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.ఆర్యవైశ్య కార్పొరేషన్కు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించని వైసీపీ నేతలు ఇప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహంపై మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. అమరజీవి త్యాగాలను గుర్తించలేని వారు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.పొట్టి శ్రీరాములు చేసిన నిరాహార దీక్ష, త్యాగాల వల్లే ఈనాడు దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ గంధం మల్లయ్యను టిడిపి యువ నాయకులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి పరామర్శించారు.మల్లయ్య నివాసానికి వెళ్లిన గౌతమ్ రెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయం ఎప్పుడైనా అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని గౌతమ్ రెడ్డి తెలిపారు.
