
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని అడిగొప్పల గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేసులో A2 ముత్యాల శివ, A4 కొనకంచి మహేష్, A5 బండ్ల గురవయ్య, A6 చల్లా సాయి శంకర్, A7 రెంటాల రామాంజిలకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారు గురజాల సబ్ జైలు నుంచి విడుదలయ్యారు.
అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన A1 యాగంటి నరేష్, A3 పువ్వాడ రామలింగంలకు కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో వారు ప్రస్తుతం రిమాండ్లోనే కొనసాగుతున్నారు.
