
తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిజిటల్ మహానాడు–2026 కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణంలోని క్లస్టర్–002 పరిధిలోని BSR కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహానేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్న మహిళా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. అలాగే మహానాడు సంకల్ప సందేశాన్ని కార్యకర్తలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ..
“తెలుగుదేశం పార్టీ పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు.”
