
నరసరావుపేట: పట్టణంలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. నరసరావుపేట రూరల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, స్టంట్స్ చేస్తున్న పలువురు యువకులను గంటల వ్యవధిలోనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ చర్యలో భాగంగా స్టంట్స్కు ఉపయోగించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నరసరావుపేట రూరల్ సీఐ ఎం.వి. సుబ్బారావు మాట్లాడుతూ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
త్వరిత చర్యలు తీసుకున్న రూరల్ పోలీస్ సిబ్బందిని, ఎస్సై కిషోర్ బాబు మరియు ఎస్సై శ్రీకాంత్లను సీఐ అభినందించారు.

