
ఉగాది తిరునాళ్లలో ఒరిగిపోయిన ప్రభ – తృటిలో తప్పిన ప్రమాదం
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం:
రేపు ఉగాది సందర్భంగా శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలో నిర్వహించనున్న అడవి పేరంటాలమ్మ తిరునాళ్ల ఏర్పాట్లలో చిన్న అపశృతి చోటుచేసుకుంది.
మతుకుమల్లి గ్రామస్తులు సంప్రదాయం ప్రకారం ప్రభను ఏర్పాటు చేసి మతుకుమల్లి నుంచి బొందిలిపాలెం ఆలయానికి తీసుకువస్తుండగా, ఆలయం సమీపానికి చేరుకునే సమయంలో ప్రమాదవశాత్తు ప్రభ ఒక వైపు ఒరిగిపోయింది.
అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, తర్వాత పరిస్థితి సాధారణమైంది.
