



పల్నాడు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
దాచేపల్లి సిఐ భాస్కరరావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులతో గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో కొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు పరిరక్షణ కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అదేవిధంగా గ్రామస్తులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
