
దుర్గి: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 10వ తరగతికి సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి డి. బెంజిమెన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కోర్సు మార్చి 13 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రణాళికతో చదివి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న 113 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. హనుమంతరావు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
📌 పాఠశాల దాత యాగంటి వెంకటేశ్వర్లు 10వ తరగతి పరీక్షల్లో మొదటి, రెండో, మూడో స్థానాలు సాధించిన వారికి రూ.50 వేల, రూ.30 వేల, రూ.20 వేల ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు.
