
దాచేపల్లి: దాచేపల్లి రూరల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా డి. నాగేశ్వరరావు నియమితులయ్యారు. గతంలో జూనియర్ ఇంజనీర్గా, ఇన్చార్జ్ ఏఈగా పనిచేసిన ఆయనకు పదోన్నతి లభించి దాచేపల్లి రూరల్ ఏఈగా నియమించబడినట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు సీపీడీసీఎల్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పి. పుల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా దాచేపల్లి విద్యుత్ శాఖ అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. వీరేశ్వరరావు, ఏఏఓ పి. సందీప్ కుమార్, జేఏఓ కె. ఆశీర్వాదం, ఏఈలు బి. భగవాన్, శంకర్ రావు తదితరులు నాగేశ్వరరావును అభినందించారు.
