



మాచర్ల: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. మాచర్ల పట్టణంలోని గ్యాస్ గోదాములను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, సీఎస్డీటీ భాషా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం గ్యాస్ సరఫరా మరియు పంపిణీ వ్యవస్థ సక్రమంగా కొనసాగుతున్నదని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. కొంతమంది సిలిండర్ బుకింగ్ సమయంలో సర్వర్ కనెక్టివిటీ సమస్యలు, ఓటీపీ రాకపోవడం వంటి టెక్నికల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయితే అవి కేవలం సాంకేతిక సమస్యలే తప్ప గ్యాస్ కొరతతో సంబంధం లేదని చెప్పారు.
ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని, అనవసరంగా ముందుగానే ఎక్కువగా బుక్ చేసుకోవద్దని సూచించారు. సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత 28 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ ఇవ్వబడుతుందని తెలిపారు. అలాగే గ్యాస్ను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ హాస్టళ్లు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు వంటి సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలకు ఇబ్బందులు రాకుండా ముందుగానే అవసరమైన సిలిండర్ల నిల్వలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్విక్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మాచర్లలోని మూడు గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించి రోజువారీగా ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ బ్యాలెన్స్ పరిశీలిస్తామని వెల్లడించారు.
ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్కు మాచర్ల: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. మాచర్ల పట్టణంలోని గ్యాస్ గోదాములను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, సీఎస్డీటీ భాషా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం గ్యాస్ సరఫరా మరియు పంపిణీ వ్యవస్థ సక్రమంగా కొనసాగుతున్నదని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. కొంతమంది సిలిండర్ బుకింగ్ సమయంలో సర్వర్ కనెక్టివిటీ సమస్యలు, ఓటీపీ రాకపోవడం వంటి టెక్నికల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయితే అవి కేవలం సాంకేతిక సమస్యలే తప్ప గ్యాస్ కొరతతో సంబంధం లేదని చెప్పారు.
ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని, అనవసరంగా ముందుగానే ఎక్కువగా బుక్ చేసుకోవద్దని సూచించారు. సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత 28 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ ఇవ్వబడుతుందని తెలిపారు. అలాగే గ్యాస్ను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ హాస్టళ్లు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు వంటి సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలకు ఇబ్బందులు రాకుండా ముందుగానే అవసరమైన సిలిండర్ల నిల్వలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్విక్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మాచర్లలోని మూడు గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించి రోజువారీగా ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ బ్యాలెన్స్ పరిశీలిస్తామని వెల్లడించారు.
ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్కు లేదా మండల స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాలని, వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. 08647-252999,9030401219, 9849905838, * 9849904027 మండల స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాలని, వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు.
