
కారంపూడి: ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కారంపూడి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రవి కుమార్ తెలిపారు. శుక్రవారం కారంపూడిలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ మండలంలో మొత్తం 654 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులు పరీక్షలు రాయేందుకు కారంపూడిలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవి బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్, ఏపీ మోడల్ స్కూల్, ఎస్టీ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అని పేర్కొన్నారు.
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 100 మీటర్ల వరకు సెక్షన్ 144 అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులు మూసివేయాలని సూచించారు.
